'నిధితులను కఠినంగా శిక్షించాలి'
JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకొని దాడిచేసి రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్లో రజక యువజన కమిటీ ఆధ్వర్యంలో చిన్నారి మృతి పట్ల బుధవారం కొవ్వత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.