రాజ్నాథ్ అధ్యక్షతన మరో కీలక భేటీ
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో నిన్న రాత్రి రెండోసారి అనధికారిక మంత్రుల బృందం(IGoM) భేటీ అయ్యింది. ఈ యుద్ధం వల్ల భారత్పై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిస్థితులను 24/7 పర్యవేక్షించాలని, ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని రాజ్నాథ్ అధికారులను ఆదేశించారు.