ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ద్వేయం

PPM: ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందిఅని కురుపాం శాసన సభ్యురాలు తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.