సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ADB: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 105 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. సంబంధిత దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.