దారుణం.. కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

దారుణం.. కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

ATP: అనంతపురం శారదానగర్‌లో గురువారం రాత్రి దారుణం జరిగింది. రామగిరిలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న రవి కుమార్ భార్య అమూల్య (30) మూడేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపి ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య గొడవలే దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.