పంచాయతీ పోరు.. అమ్మమ్మపై మనవరాలు విజయం
TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కట్య్రాల గ్రామ సర్పంచ్ పోటీలో అమ్మమ్మ, మనుమరాలు బరిలో నిలిచారు. గతంలో ఓసారి సర్పంచ్గా పని చేసిన పోశమ్మపై తన మనుమరాలు రమ్య పోటీ చేసింది. నిన్న జరిగిన ఎన్నికల్లో తన అమ్మమ్మపై 72 ఓట్లతో మనవరాలు రమ్య విజయం సాధించింది.