చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

KNR: తిమ్మాపూర్ మండలం ఇందిరా నగర్ స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్య చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈనెల 2న హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూకి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, కరీంనగర్ కట్టరాంపూర్ కు చెందిన విద్య మృతి చెందింది.