ఎమ్మెల్యేకు వినతిపత్రం అంతజేసిన ఎస్ఎఫ్ఐ నేతలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వార్డన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఇవాళ ఎస్ఎఫ్ఐ నేతలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే మహిళా వార్డెన్ నియమించేలా చూడాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజురియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని కోరారు.