మహాధర్నా స్థలం పరిశీలన
HYD: ఎన్నికల హామీలు అమలు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ అన్నారు. HYD ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రేపు జరిగే ధర్నా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో బీజేపీ మహా ధర్నా నిర్వహించనున్నట్లు, ధర్నాకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలన్నారు.