'2028 నాటికి విజయవాడ నుంచి విదేశాలకు విమానాలు'

AP: 2028 నాటికి విజయవాడ నుంచి దేశ, విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని జనసేన ఎంపీ బాలశౌరి వెల్లడించారు. వారణాసి, శ్రీలంక, దుబాయ్కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి సింగపూర్, థాయ్లాండ్కు నేరుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అమెరికాకు ఇక్కడి నుంచి నేరుగా విమానాల సర్పీసుల కోసం సీఎం చంద్రబాబును కోరినట్లు చెప్పారు.