ఇసుక అక్రమంగా తరలింపు.. కేసు నమోదు
NRPT: ఊట్కూర్లోని త్రిప్రాస్పల్లి గ్రామానికి చెందిన మక్తల్ రాజు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకుని కేసు నమోదు చేశారు. చెక్పోస్ట్ సమీపంలో పోలీసులు టిప్పర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనానికి సంబంధించిన అనుమతి పత్రాలు చూపించాలని డ్రైవర్ను కోరగా, అతడు చూపించలేకపోయాడు. దీంతో టిప్పర్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.