VIDEO: బత్తలపల్లిలో కోటి సంతకాల సేకరణ
సత్యసాయి: బత్తలపల్లిలో వైసీపీ నేతలు శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అన్యాయమని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్ తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరం అవుతుందని ఈ విధానం వెనక్కి తీసుకోవాలని కోరారు.