వైభవం శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం
KRNL: పెద్దకడబూరులో ఉగాది పండుగ సంధర్బంగా నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి రథాన్ని కదిలించారు. స్థానిక చావిడి దగ్గర నుంచి బస్ స్టాండ్ సమీపం వరకు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.