పందుల సంచారం.. దోమల దుమారం
VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో జనవాసాల మధ్య పందులు సంచరిస్తూ కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అవి స్వైరవిహారం చేస్తున్నాయని, దోమల బెడద కూడా రోజురోజుకు ఎక్కువ అవుతోందని వారు అన్నారు. అధికారులు స్పందించి వెంటనే దోమల బెడదకు నివారణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.