పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష
BPT: ఇంకొల్లు పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడికి ఒంగోలు కోర్టు పోక్సో కేసు కింద 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధించింది. కేసులో సాక్ష్యాలు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.