జాగృతి అధ్యక్షురాలు కవిత మళ్లీ అరెస్ట్
ఖమ్మం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మళ్లీ అరెస్ట్ అయ్యారు. నిన్న బాధితులకు అండగా వెలుగుమట్లలో పర్యటించిన కవిత రాత్రి నుంచి అక్కడే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కవితతో పాటు డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజన్, దీక్ష చేస్తున్న ఇతర నాయకులను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు.