విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే.?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి శుక్రవారం వివిధ సేవల ద్వారా రూ. 2,26,598 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 117 మంది స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, అన్న ప్రసాద ట్రస్ట్ ద్వారా 1800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు.