రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
బాపట్ల: కొరిశపాడు మండలం మెదరమెట్లలోని ఒంగోలు రోడ్డు నందు సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సును రాంగ్ రూట్లో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలిపోగా బస్సులో ఉన్న కొప్పెరపాడుకు చెందిన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే దేవ కుమారి అనే మహిళకు గాయాలు అయ్యాయి. ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.