నూతన డీఈవో జైనిని అభినందించిన అదనపు కలెక్టర్
KMM: ఖమ్మం డీఈవోగా నియమితులైన చైతన్య జైనిని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజను మంగళవారం కలెక్టరేట్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేసి, జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు పాటుపడతానని డీఈవో జైని తెలిపారు. పలువురు ఆమెను అభినందించారు.