ఏరియా హాస్పిటల్లో అరుదైన దంత శస్త్ర చికిత్స
SKLM: నరసన్నపేట ఏరియా హాస్పిటల్లో దంత వైద్య నిపుణుడు బలగ రమేష్ నాయుడు అరుదైన దంత శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జమ్మూ గ్రామానికి చెందిన పొన్నాడ గోవిందా రావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పై దవడ దంతాలు ఊడిపోయి హాస్పిటల్కు రావడంతో, రమేష్ నాయుడు మరియు ఆయన సహాయకురాలు సత్య సాయి కలిసి ఆ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.