అనాలోచిత నిర్ణయాలు.. ప్రజలు నరకయాతన..!
గుంటూరు-విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద నేషనల్ హైవే అధికారుల అనాలోచిత నిర్ణయాలు వాహనదారులకు శాపంగా మారాయి. విజయవాడ వెళ్లేవారు హాయ్ల్యాండ్ వైపు 2కి.మీ సర్వీస్ రోడ్డులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఫ్లైఓవర్ నిర్మించకపోవడంతో వాహనాలు ఎటునుంచి వస్తున్నాయో తెలియక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్ చెల్లిస్తున్నా నరకం తప్పడం లేదని వాపోతున్నారు.