బ్రాహ్మణచెరువులో 'ఫ్రైడే డ్రై డే'

బ్రాహ్మణచెరువులో 'ఫ్రైడే డ్రై డే'

W.G: పెనుమంట్రలోని బ్రాహ్మణచెరువులో శుక్రవారం ఫ్రైడే-డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల వద్ద నిల్వ ఉన్న చెత్త, వ్యర్థాలను తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విషజ్వరాల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు.