కలెక్టర్ను కలిసిన నూతన ఏసీపీ
KMM: ఇటీవల కల్లూరు ఏసీపీగా వసుంధర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పూల మొక్కను అందజేశారు. ఈ క్రమంలో జిల్లాలోని శాంతి భద్రతలపై కాసేపు చర్చించారు.