కొల్లూరులో బాలుడి మృతదేహం లభ్యం

కొల్లూరులో బాలుడి మృతదేహం లభ్యం

GNTR: కొల్లూరు కేటీ కాలనీ వద్ద కాలువలో 13 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. కొల్లూరుకు చెందిన తుమ్మ చింతయ్య కుమారుడు శివ సుబ్రహ్మణ్యం (13) ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయినట్లు కొల్లూరు ఎస్సై అమర వర్ధన్ తెలిపారు. శనివారం అతని మృతదేహం కాలువలో కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తెనాలి వైద్యశాలకు తరలించారు.