వేమూరు వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు
BPT: వేమూరు నియోజకవర్గంలోని 195 మంది వీవోఏలకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు 5జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. డిజిటల్ సేవలు, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. వేమూరు పరిధిలోని 63 వేల మంది డ్వాక్రా సభ్యులకు సేవలు మరింత చేరువవుతాయన్నారు.