కనిగిరిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ
ప్రకాశం: కనిగిరి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో మొత్తం 1,278 కేసులు పరిష్కరించబడినట్లు జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ తెలిపారు. వాటిలో క్రిమినల్ కేసులు 39, సివిల్ కేసులు 32, భరణం కేసులు 2, చెక్ బౌన్స్ కేసులు 5, ఎస్టీసీ కేసులు 1,200 ఉన్నాయని చెప్పారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి ఈ కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.