రోడ్డుపై గుంతలు పూడ్చివేత.. ప్రజల హర్షం

రోడ్డుపై గుంతలు పూడ్చివేత.. ప్రజల హర్షం

KMR: డోంగ్లి మండల కేంద్రం నుండి కుర్ల గ్రామం వైపు వెళ్లే రహదారి పైన భారీ గుంతలను అధికారులు పూడ్చివేశారు. మద్నూర్ ఎస్సై విజయ్ కొండ, డోంగ్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ సాయిబాబా తదితర అధికారులు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నారు. దీంతో పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అధికారులను ప్రజలు, వాహనదారులు ప్రశంసించారు.