ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులే సొంతగా ఛానెళ్లను ప్రారంభించి బాధ్యతా రాహిత్యంగా వ్యవరించటంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆన్లైన్ కంటెంట్పై ఎవరోఒకరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. యూట్యూబర్ రణ్వీర్ అలహాబదియా కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.