ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే
NRML: నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు. బుధవారం మామడ మండలం జైరాం తండాలో రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు.