'ప్రధాన ఆలయాల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలి'
ASR: రాష్ట్రంలోని ప్రధాన హిందూ దేవాలయాల్లో GCC ఆధ్వర్యంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలని GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని కోరారు. అమరావతిలో ఆయనను కలిసి ప్రతిపాదనలు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో GCC స్టాల్స్కు సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.