పుంగనూరులో సైనికులకు సన్మానం

CTR: పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు నిర్వహించారు. ఇందులో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి కార్గిల్ వార్లో పాల్గొన్న విశ్రాంత సైనికులు మహేశ్వర్, ప్రస్తుతం సర్వీస్లో కొనసాగుతున్న రమేశ్, కుమార్ను సన్మానించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు.