నేడు దండుమల్కాపురంకు గవర్నర్ రాక

నేడు దండుమల్కాపురంకు గవర్నర్ రాక

BNR: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని అశోకా బిజినెస్ స్కూల్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం రానున్నారు. కళాశాలలో నిర్వహించే కాన్వొకేషన్‌లో విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేస్తారని ఆ కళాశాల సెక్రటరీ ఎన్.అర్జున్ తెలిపారు. అలాగే కార్యక్రమంలో ఇరాన్ అధికారిక ప్రతినిధి మహది షారోభీ, డెలాయిట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ శర్మ హాజరు కానున్నారు.