బ్రిడ్జి పిల్లరుకు పగుళ్లు.. రాకపోకలు బంద్

బ్రిడ్జి పిల్లరుకు పగుళ్లు.. రాకపోకలు బంద్

JGL: మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వరదకాలువ (82.03km) బ్రిడ్జికి సంబంధించిన ఒక పిల్లరుకు పగుళ్లు ఏర్పడడంతో తాత్కాలికంగా బ్రిడ్జిని ఇరిగేషన్ అధికారులు మూసేశారు. ఈ బ్రిడ్జిపై నుంచి క్రషర్ల భారీ వాహనాల రాకపోకల కారణంగా బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి మూసేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.