దేవాలయానికి నూతన కమిటీ ఎన్నుకోవాలని వినతి
BHNG: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పున:ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవాలని గ్రామస్తులు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. దశాబ్ద కాలంగా ఒకరే అధ్యక్షుడిగా ఉన్నారని, ఇకపై అన్ని కులాలకు, యువతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త కమిటీ వేయాలని కోరారు.