ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు సన్మానం

ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు సన్మానం

NRML: బాసర ఆలయ అభివృద్ధికి రూ. 225 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కృషి ప్రశంసనీయమని ఆలయ పూజారులు, గ్రామస్తులు తెలిపారు. మంగళవారం భైంసాలోని ఆయన నివాసంలో శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించడం ఆనందకరమన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.