స్నేహితుల దినోత్సవం నాడు తీవ్ర విషాదం..

ATP: రాయదుర్గం మండలంలోని టి. వీరాపురం గ్రామ సమీపంలో దొణగంగమ్మ గుడి వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి తోటకు వెళ్లిన వీరు సాయంత్రానికి నీటి కుంటలో శవాలై తేలారు. రాత్రి 7 గంటలకు వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతి చెందిన స్వేత (11) మౌనిక (9) ఇద్దరు పక్క పక్క ఇంటిలో ఉండే ప్రాణస్నేహితులు కావడం విశేషం.