'నాంపల్లి రైల్వేస్టేషన్ను 2027లోగా పూర్తి చేస్తాం'
HYD: అంతర్జాతీయ ప్రమాణాలతో నాంపల్లి రైల్వేస్టేషన్ను 2027లోగా పూర్తిచేస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి దశలో రూ.327 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, దశల వారీగా స్టేషన్ రూపు రేఖలే మారుస్తామని స్పష్టం చేశారు.