బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అడిషనల్ జడ్జి
GDWL: జిల్లా, కృష్ణానది ఒడ్డున కొలువైన బీచుపల్లి ఆంజనేయ స్వామిని మహబూబ్నగర్ అడిషనల్ జడ్జి కళ్యాణ్ చక్రవర్తి సోమవారం దర్శించుకున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. జడ్జితోపాటు అనిల్ శర్మ, మారుతి చారి, నరేష్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన అర్చకులు, వారికి తీర్థ ప్రసాదాలు అందజేశామన్నారు.