ముగిసిన పారా బాడ్మింటన్ పోటీలు

ముగిసిన పారా బాడ్మింటన్ పోటీలు

VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరత్ ఖాదర్ వలి బాబా పుణ్యక్షేత్రం ధర్మకర్త డా.ఖలీల్ బాబు హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్స్ అందజేశారు.