VIDEO: 'ఓటు వేయకుంటే చావుతో సమానం'

VIDEO: 'ఓటు వేయకుంటే చావుతో సమానం'

NGKL: వెల్దండ(M) రాచూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు లక్ష్మమ్మ(104) పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క ఎన్నికల్లోనూ ఓటు వేయకుండా ఉండలేదని ఆమె తెలిపారు. ఓటు హక్కు మన జన్మ హక్కు. ఓటు వేస్తేనే మనం బతికి ఉన్నట్లు, ఓటు వేయకపోతే అది చావుతో సమానం" అని అన్నారు. కాగా నేటి యువతకు లక్ష్మమ్మ నిజంగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు.