స్మృతి వనం పనులను పరిశీలించిన మంత్రి
సత్యసాయి: రాజధాని అమరావతిలోని తుళ్లూరు ప్రాంతంలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం పనులను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. ఈనెల 16న అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా స్మృతి వనంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ స్మృతి వనం నిర్మాణం లక్ష్యమన్నారు.