పది పరీక్షలకు సర్వం సిద్ధం : కలెక్టర్
కడప: నేడు జిల్లాలో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు భయాందోళనలు వీడి ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.