మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

బొబ్బిలి పట్టణ సీఐ కె. నారాయణరావు ఆధ్వర్యంలో స్థానిక ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గంజాయి, మత్తు పానీయాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చదువుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలు వివరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.