ఆన్యూటీ పే అవుట్ మోడల్కు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం
విశాఖలో 88.35 కి.మీ రహదారుల అభివృద్ధికి ఆన్యూటీ పే అవుట్ మోడల్కు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. రూ.307 కోట్ల వ్యయంతో ఒకే కాంట్రాక్టర్కు పనులు అప్పగించి నాణ్యత, ఏకరూపత, గడువు పాటింపును సాధించనుందన్నారు. ప్రధాన రహదారుల పునరుద్ధరణ, మెడియన్, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం తెలిపారు.