సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
ASR: గూడెం కొత్తవీధి మండలంలోని పెదవలస, దుచ్చరిపాలెం, గాలికొండ, అడగరపల్లి, శంకాడ కొత్తూరు, బూరుగుపాకలు, అసరాడ, కొడిసింగి, బోనంపల్లి తదితర గ్రామాల్లో సోమవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించామని ఏవో డీ.గిరిబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర-2047, నీటి భద్రత, సాగు పద్ధతులు, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.