'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MDK: రానున్న 24 గంటల్లో వాతావరణ శాఖ సూచన మేరకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామాయపేట తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.