అన్నీ నిజాలే చెప్పాను: వైవీ సుబ్బారెడ్డి
AP: కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఛైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డిని నిన్న సిట్ విచారించింది. విచారణ అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విచారణలో సిట్ అధికారులకు అన్నీ నిజాలే చెప్పానని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో నిజనిజాలు తెలియడానికి తాను సుప్రీంలో పిటిషన్ వేశానన్నారు.