నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLG: నార్కట్ పల్లిలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా విద్యుత్ స్తంభాలను మారుస్తునందుకు. పట్టణంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని మండల విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి పట్టణ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.