తాళ్లూరు ధర్నాకు పిలుపు
ప్రకాశం: PRC కమిషన్ ఏర్పాటు, CPS రద్దు, IR ప్రకటన తదితర ఉపాధ్యాయుల సమస్యలపై దర్శిలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు తాళ్లూరు మండల ఉపాధ్యాయ సంఘాలు (APTF) పిలుపునిచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొనాలని కోరారు.