రాయచోటిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అన్నమయ్య: గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలను గుర్తుచేసుకుంటూ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.